సతీష్ నీనసాం కథానాయకుడిగా ‘కాంతార’ ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘ది రైజ్ ఆఫ్ అశోక’. కన్నడ, తెలుగు,తమిళ భాషలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి వినోద్.వి.దుండలే దర్శకుడు. వృద్ది క్రియేషన్స్ అండ్ సతీష్ పిక్చర్ హౌస్ పతాకంపై వర్ధన్ హరి, జైష్ణవి, సతీష్ నీనసాం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో కళాసృష్టి ఇంటర్నేషనల్ పతాకంపై రవిశంకర్ తెలుగులో ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పంపిణి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 27న ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల కాబోతుంది. కాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్ విడుదల కార్యక్రమం శుక్రవారం చిత్ర టీమ్ సమక్షంలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కథానాయకుడు సత్యదేవ్ హాజరై ట్రైలర్ను విడుదల చేశారు.
ఈ సందర్బంగా సత్యదేవ్ మట్లాడుతూ ” ” తెలుగు ప్రేక్షకులు కంటెంట్ సినిమాలను ఆదరిస్తారు. ఈ సినిమాను కూడా ఆదరిస్తారు. ట్రైలర్ చూసి మా ఆడియన్స్ ఈ సినిమా చూడాలని డిసైడ్ అయ్యారు. కన్నడ నుంచి వచ్చే రూటెడ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు ఇష్టం. తప్పకుండా ఈ సినిమా కూడా అదే కోవలోకి వస్తుందని అనుకుంటున్నాను. నా సినిమా జీబ్రా కన్నడ విడుదల సమయంలో సతీష్, సప్తమి నాకు సపోర్ట్ చేశారు. సతీష్ మంచి నటుడు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఈ సినిమా దర్శకుడు ఈ సినిమా షూటింగ్ సమయంలో మరణించాడు. అప్పుడు సతీష్ ఈ సినిమాను పూర్తిచేసి ఈ స్టేజ్కు తీసుకొచ్చారు. కన్నడ సినిమాలు రూటెడ్గా ఉన్న వాటికి తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ది రైజ్ ఆఫ్ అశోక్ కూడా ఆ కోవలోకి తెచ్చిందే. తెలుగు ఆడియన్స్ మంచి కంటెంట్ ఇస్తే విజయాన్ని ఇస్తారు. హీరోయిన్ సప్తమి తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.











