హైదరాబాద్: హైదరాబాదులో మరోసారి ఐటీ దాడులు కలకలం చేపాయి. పిస్తా హౌస్ షాగౌస్ హోటల్లో యజమానుల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు జరిపారు. పిస్తా హౌస్, షాగౌస్ హోటల్స్ ప్రతి ఏటా వందల కోట్లు వ్యాపారం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో పిస్తా హౌజ్ ప్రధాన కార్యాలయంలో ఐటీ తనిఖీలు కొనసాగాయి. రాజేంద్రనగర్ లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్ ,మహమ్మద్ ముస్తాన్ ఇళ్లల్లో ఐటి అధికారులు సోదాలు జరిపారు.
రికార్డుల్లో చూపిన ఆదాయం నిజమైన ఆదాయం మధ్య వ్యత్యాసం గుర్తించినట్లు సమాచారం. హావాలా, నకిలీ లావాదేవులు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్ ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ట్యాక్స్ చెల్లింపులో వ్యత్యాశం గుర్తించారు. మొత్తం నాలుగు టీమ్స్ గా ఏర్పడి సోదాలు చేస్తున్నారు.











