కుత్బుల్లాపూర్: లంచం ఇవ్వలేదని తాను కట్టుకున్న ఇంటిని లేని సమయంలో కూల్చివేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి భూదేవి హిల్స్ లో నిన్న కుత్బుల్లాపూర్ ఆర్ఐ అక్రమంగా తాము కట్టుకొని ఉంటున్న ఇంటిని జెసిబి తో కూల్చివేశాడంటూ బాధితుడు ఓదెలు ఆందోళన వ్యక్తం చేసాడు. 2018లో 21 లక్షల రూపాయలతో స్థానికంగా అనధికార లేఅవుట్ చేసి విక్రయిస్తున్న బాలకృష్ణ అనే వ్యక్తి వద్ద తాను కొనుగోలు చేసినట్లు తెలిపారు.
గత ఎనిమిది నెలల నుండి ఈ ప్రాంతంలో రెండు గదులు నిర్మించుకొని ఈ మధ్యనే గృహప్రవేశం చేసి ఉంటుండగా గురువారం తము బయటకు వెళ్లిన సమయంలో అక్రమంగా కూల్చివేశారు అంటూ మధ్యవర్తి ద్వారా ఆర్ఐ గతంలో 2 లక్షల రూపాయలు అడిగాడు అంటూ ఆరోపించాడు. మాకు ప్లాట్ అమ్మిన బాలకృష్ణను సంప్రదిస్తే ఇది ప్రభుత్వ భూమి కాదు మీరు ఆర్ ఐ పై కేసు పెట్టాలంటూ సలహా ఇచ్చాడు. కానీ మేము ఎవరిని సంప్రదించాలో అర్థం కాని పరిస్థితిలో మీడియాను వేడుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.











